16 March, 2026 | 10:04 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భవనం నిర్మించాలి

08-01-2026 01:36 AM

ఏబీవీపీ నాయకులు 

రామాయంపేట, జనవరి 7: మెదక్ జిల్లా రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్న సొంత భవనం లేకపోవడం దురదృష్టకరమని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ అన్నారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ను కలిసి కళాశాల సమస్యలు వివరించి, వినతి పత్రం అందజేశారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తరగతి గదులు లేకపోవడం విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందన్నారు.

ఒక సబ్జెక్టు బోధించేటప్పుడు, మరో ఇయర్ విద్యార్థులు బయట కూర్చోవలసి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. 150 మంది విద్యార్థులు ఉంటే 50 మంది బాలికలే ఉన్నారని తక్షణమే స్పందించి కళాశాలకు సొంత భవనం నిర్మించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు ఆయనతో పాటు ఏబీవీపీ నాయకులు అర్జున్ సతీష్ దినేష్ సన్నీ సాయి తదితరులు ఉన్నారు.