28 August, 2026 | 8:09 PM

Breaking News

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ : గుండా నిరంజన్   •   సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •  

రేవంత్ పాలనలో అప్పులు పెరుగుతున్నాయే తప్పా అభివృద్ధి లేదు!

06-07-2026 01:02 AM

మాజీ మంత్రి రెడ్యానాయక్ విసుర్లు 

మహబూబాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమం, ఆరు గ్యారెంటీలు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పులు పెరుగుతున్నాయి తప్ప సంక్షేమం కానరావడం లేదని, రైతుల అవసరాల గురించి ఆలోచించాలనే మంచిబుద్ది ఈ.. ప్రభుత్వానికి రావడంలేదని, అడ్డుకున్నంత మాత్రానా, అరెస్ట్ లు చేసినంత మాత్రాన ప్రజాగ్రహాన్ని ఆపలేరని మాజీ మంత్రి డి ఎస్ రెడ్యా నాయక్ అన్నారు.

ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ఇప్పటికే ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని, ఆకాశం మీద ఉమ్మి వేయడం మాని..., మీరు చేసిన పనులేమైనా ఉంటే చెప్పండని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం ప్రతిపక్షాల బాధ్యత అని, ఆ బాధ్యతను నెరవేర్చడానికి కేటీఆర్ కన్నేపల్లి పర్యటనకు వస్తే అడుగడుగున అడ్డుకోవడం అధికార పక్షానికి తగదన్నారు.