calender_icon.png 17 June, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త

17-06-2025 06:10:33 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా కార్యక్రమాన్ని నిన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పెట్టుబడి నిధులను తెలంగాణ ప్రభుత్వం రైతులందరి ఖాతాలోకి ఎకరానికి రూ.6 వేల చోప్పున రైతు భరోసా నిధులను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రెండు ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మూడు ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 6 వేల చొప్పున రూ.1551.89 కోట్లు రైతు భరోసా నిధులు మంజురు చేసిందని మంత్రి తెలిపారు. 

ఇప్పటి వరకు 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామని, ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రేపటి నుంచి 4 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ అవుతాయని వ్యాఖ్యానించారు. 9 రోజుల్లో అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రైతు భరోసా నిధుల జమ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు. గత రబీ సీజన్ సమయంలో నాలుగు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న రైతులకు ఇప్పటికీ డబ్బులు రాకపోవడంతో గతంలో బకాయిలున్న రైతుల్లో ఇప్పుడైన వస్తాయరావా అనే ఆందోళన ఎక్కువైంది.