calender_icon.png 25 June, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

24-06-2025 10:39:39 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణ శివారులో హుజురాబాద్ పరకాల రహదారిపై సాయిరాం రైస్ మిల్లు సమీపంలో 35 సంవత్సరాల వ్యక్తి రోడ్డు  ప్రమాదంలో సోమవారం గాయపడి ఉన్నాడు. అక్కడ ఉన్న హమాలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించి 108 ద్వారా హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ లోని ఎంజిఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. ప్రమాద స్థలంలో ఏపీ 13 ఎస్ 7055 నెంబర్ గల ఎరుపు రంగు హోండా ద్విచక్ర వాహనం ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తుపట్టినట్లయితే  ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హుజురాబాద్ 8712670773, ఎస్సై యూనిస్ అహ్మద్ అలీ 7569919123 నంబర్లకు సమాచారం అందించాలని హుజురాబాద్ సిఐ కరుణాకర్ తెలిపారు.