11-06-2025 12:36:04 AM
కరీంనగర్ క్రైం, జూన్ 10 (విజయ క్రాంతి): రెండోసారి ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రి అయి కూడా సంవత్సరం గడిచినా బండి సంజయ్ కేంద్రం నుంచి చిల్లి గవ్వ తేలేదని బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఎద్దేవా చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయకున్న బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.
బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నవోదయ పాఠశాలలు, సైనిక్ స్కూల్స్ మంజూరి, వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను ప్రసాద్ స్కీంలో చేర్చి అభివృద్ధి చేయాలని, కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజూ రైలు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నిరుద్యోగ యువత ఉపాధి కోసం కేంద్రం నుంచి కొత్త పరిశ్రమ, కరీంనగర్ అభివృద్ధి కోసం 200 కోట్లు మంజూరు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపెల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, మాజీ వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్, బిఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, నాయకులు గంగాధర చందు, బొంకూరి మోహన్, షౌకాత్, చేతి చంద్రశేఖర్, ఆరె రవి గౌడ్, తదితరులుపాల్గొన్నారు.