11-06-2025 12:37:54 AM
ఇల్లెందు, జూన్ 10 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియా లో సింగరేణి డైరెక్టర్ (ప్రాజెకట్స్& ప్లానింగ్) కే. వెంకటేశ్వర్లు, జి.యం (క్వాలిటీ) కనకయ్య మంగళవారం ఇల్లందు ఏరియా లోని జెకె-5 ఓసీ, నూతన జే.కే కోల్ మైన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్బంగా వారు తొలుత జే కె ఓసీ పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను ఎస్ ఓ టు జి.యం. రామస్వామిని అడిగి తెలుసుకున్నారు. తరువాత వారు మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి , రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించాలని, బొగ్గు ఉత్పత్తి , రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, అలాగే బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచే జి.13 బొగ్గు ఉత్పతి ఐయే లాగా చూడాలని అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలు, రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని అన్నారు.
తరువాత నూతన జే కే కోల్ మైన్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలను పరిశీలించి రివ్యూ చేపట్టారు. నూతన ఓ.సి కి సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి బొగ్గు రవాణా జరిగేటట్లు చూడాలని ఎస్ ఓ టు జి.యం కు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో జే.కే కోల్ మైన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎ.కృష్ణ మోహన్ రావు, కోయగూడెం పి.ఓ గోవింద రావు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.