calender_icon.png 30 June, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు.. ఆ వ్యక్తే అధ్యక్షుడు

30-06-2025 03:00:54 PM

హైదరాబాద్: బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ నామినేషన్ ఎవరైనా వేసుకోవచ్చు.. అధిష్ఠానం చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. సాయంత్రం నామినేషన్లు స్వీకరించి పరిశీలిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎవరో చెప్పారని అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదని సూచించారు. అధిష్ఠానం చెప్పిన వ్యక్తే అధ్యక్షుడు(BJP President election) అవుతారని తేల్చిచెప్పారు.

అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మీ కాదు.. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఆయన వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) తెలంగాణ యూనిట్ కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు ఎన్. రాంచందర్ రావు నియమితులయ్యారు. పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా రావును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎక్కువకాలం ఉన్నవారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఏపీలో మాధవ్‌, తెలంగాణలో రామచందర్‌రావుల ఎంపికయ్యారు.