వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర మంత్రి
13-11-2025 06:49 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె గ్రామం మాజీ సర్పంచ్ ధమ్మ రవీందర్ రెడ్డి కూతురు వివాహానికి కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) గురువారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపీ, మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్, రమేష్ రెడ్డి, పొన్నాల సత్యం, చిట్నెని శ్రీనివాసరావు వంశీ, సుధాకర్, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




