13-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా దంపతులు గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ అధికారిక నివాసానికి వచ్చిన సతీష్ మహనా దంపతులను గడ్డం ప్రసాద్ కుమార్ శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించి, మెమెంటో బహుకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ, యూపీ శాసనసభల నిర్వహణపై ఇరువురు ముచ్చటించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉన్నారు.