03-01-2026 04:39:48 PM
కేసముద్రం,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు ఎరువుల డీలర్ల ద్వారా కేసముద్రం మండల రైతులకు గ్రామాల వారిగా రైతు భరోసా పోర్టల్ డేటా బేస్ ఆధారంగా రైతుల లిస్టులు ఒకరోజు ముందు గ్రామాలకు పంపించి శనివారం 2,844 యూరియా బస్తాలను రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి భానోత్ వెంకన్న తెలిపారు.
కేసముద్రం మండలంలోని వివిధ యూరియా పంపిణి సెంటర్లను మండల వ్యవసాయ అధికారి వెంకన్న సందర్శించి పంపిణీతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు ఎవరు యూరియా కోసం ఆందోళన చెందవద్దని, మండలానికి కావలసినటువంటి యూరియా రైతులకు విడతలవారీగా తెప్పించి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
యూరియా డిస్ట్రిబ్యూషన్ యాప్ ద్వారా పంపిణీ చేసే విధానంలో రెండో విడతలో ఉన్నందున త్వరలో యాప్ అందుబాటులోకి వస్తుందని, కేసముద్రం మండలంలోని ప్రతి రైతు గూగుల్ ప్లే స్టోర్ నుండి యూరియా బుకింగ్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో మల్లారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, జిపిఓ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.