calender_icon.png 25 June, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రపంచ శాంతికి విఘాతం

24-06-2025 04:54:28 PM

నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి..

చండూరు/నాంపల్లి (విజయక్రాంతి): ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రపంచ శాంతికి విఘాతమని సీపీఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి(CPM Mandal Secretary Nampally Chandramouli) అన్నారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాతో నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... జూన్ 13 నుండి ఇరాన్ పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు వత్తాసు పలకడమే కాకుండా అమెరికా ప్రత్యక్ష యుద్దానికి పూనుకోవడాన్ని యావత్ ప్రజానీకం వ్యతిరేకించాలని ఆయన అన్నారు.

యుద్ధాలు ఆపకపోతే ఆయా దేశాల వనరులు లావాదేవులు దెబ్బతింటాయని అమాయకమైన ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. అణు ఆయుధాల తయారీకి ఇరాన్ పూనుకుంటుందని హెచ్చరించిన అమెరికా ఇజ్రాయిల్ వద్ద 180 అణు ఆయుధాలు ఉన్నాయనే ప్రచారం ఉన్నా కిమ్మనకుండా అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలన్ని అమెరికా దుశ్చర్యలను నిరసిస్తున్నారని, ఇప్పటికైనా యుద్దాన్ని ఆపి శాంతి నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య గడ్డం గురుమూర్తి, వెంకటయ్య, శంకర్,సైదులు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.