calender_icon.png 17 June, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నీట్’లో వాగ్దేవి కాలేజీ ప్రభంజనం

15-06-2025 12:00:00 AM

- అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులు

- అభినందించిన కరస్పాండెంట్ విజేత వెంకటరెడ్డి 

మహబూబ్‌నగర్, జూన్ 14 (విజయక్రాంతి): నీట్ యూజీ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారని వాగ్దేవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

న్ క్లాస్ ప్రత్యేక ప్రోగ్రాంతో ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్‌తో నాణ్యమైన విద్యను అందించి జాతీయస్థాయిలో మేము సైతం అంటూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి సాధారణ విద్యార్థులు సైతం డాక్టర్లుగా మార్చిన ఘనత వాగ్దేవి అని చెప్పారు. ఇంతటి ఘనవిజయానికి అధ్యాపకుల సమిష్టి కృషి చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన కొందరు నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తూ వారి జీవిత కల డాక్టర్ కావడాన్ని నిజం చేసిన ఘనత వాగ్దేవి జూనియర్ కళాశాలకు దక్కిందని తెలిపారు.

85 మంది విద్యార్థుల్లో 38 మందికపైగా మెడికల్ సీట్లు సాధించారని చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ నీట్ అకాడమీ ఇన్‌చార్జి పావనిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ గీతాదేవి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి నందన్‌రెడ్డి, అకాడమీ అడ్వైజర్ యాకూబ్, ఎంసెట్ ఇన్‌చార్జ్ షాకీర్, ఎగ్జామినేషన్ ఇన్‌చార్జ్ చెన్నయ్య, యాజమాన్య సభ్యులు కోట్ల శివకుమార్, సతీష్‌రెడ్డి, నాగేందర్, రాఘవేంద్రరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.