14-06-2025 01:09:01 AM
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి ని వాసవి సేవక్ కమిటీ సభ్యులు శుక్రవారం తన కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీనివాస్ నగర్ కాలనీ పార్కులో ఈ నెల 15 వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహించే హెల్త్ క్యాంపుకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవక్ ప్రెసిడెంట్ అల్లాడి మహేష్, ఫౌండర్స్ వెంకటేష్, అనిల్, లింగాల గంగాధర్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.