14-06-2025 01:07:33 AM
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): కర్ణాటక, తెలంగాణలో కుల గణన చేసిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ రెండు రాష్ట్రాల్లో చేసింది కుల సర్వే మాత్రమేనని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా మోదీ సర్కారు జనగణనలో భాగంగా కులగ ణన చేస్తామని ప్ర కటించడంతో కాం గ్రెస్ అధిష్ఠానానికి, రాహుల్ గాం ధీకి ఆందోళన పెరిగిపోయిందని దుయ్యబట్టారు. 2011లో యూపీఏ సర్కారు చేసిన సోషి యో ఎకనమిక్ కుల సర్వే వివరాలను నేటికీ బయటపెట్టకపోవడం చూస్తే కాం గ్రెస్ పార్టీ తీరు అర్థమవుతోందన్నారు.
తెలంగాణలో కుల సర్వేలోనూ బీసీలను తక్కువ చేసి చూపించారని, ముస్లింలను బీసీల్లో చేర్చి అసలైన బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రయ త్నిస్తున్నారని ఆరోపించారు. 1986లో మురళీధర్రావు కమిటీ తెలంగాణలో 52 శాతం మేర బీసీలున్నారని చెప్పిందని, 39 ఏళ్లలో బీసీల సంఖ్య ఎలా తగ్గిపోయిందని ప్రశ్నించారు.
ము స్లిం ఓటు బ్యాంకును మరింత పటిష్ఠం చేసుకునేందుకే ఈ తప్పుడు కుల సర్వే చేసి వారిని బీసీల్లో చేర్చారని ఆరోపించారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 243 ప్రకారం సర్వే చే యించి ఆ ప్రకారం స్థా నిక ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసే అధి కారం రాష్ట్రానికి ఉందని గుర్తుచేశారు.