14-06-2025 01:09:12 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ సహా దేశంలోని ఉగ్రవాదం, వేర్పాటువాదం ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదంతోపాటు మావోయిస్టుల ఏరివేతలో సీ ఆర్పీఎఫ్ బలగాలు చూపుతున్న తెగువ ఎం తో గొప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు. దేశంలోని అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించటంలో సీఆర్పీఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు.
దేశ అంతర్గత భ ద్రత విషయంలో సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలను వెలకట్టలేనివని అభివ ర్ణించారు. జం షెడ్పూర్లో నూత నంగా నిర్మించిన పలు సీ ఆర్పీఎఫ్ భవనాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమా న ప్రమాదంలో దుర్మరణం పాలైనవారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రపంచంలోనే అత్యు త్తమ పారామిలిటరీ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఒకటని ఆయన తెలిపారు.
దేశంలో అనేక విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న సంస్థ సీఆర్పీఎ ఫ్కుందన్నారు. దేశంలోని అన్ని ఎన్నికల్లో సీఆర్పీఎఫ్ సేవలను వినియోగించుకో వడం ఆ సంస్థపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీ విద్యుత్ బరణ్ మహతో, అదనపు డీజీ అమిత్ కుమా ర్, ఐపీఎస్ అధికారులు శాలినీ, సాకే త్ కుమార్తోపాటు పలువురు పోలీసు సీనియర్ అధి కారులు పాల్గొన్నారు.