30-12-2025 12:00:00 AM
హనుమకొండ,డిసెంబర్ 29 (విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సోషాలజీ, సోషల్ వర్క్ విభాగాలు సంయుక్తంగా జనవరి 3, 2026 న నిర్వహించనున్న వీర్ బాల్ దివస్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో. మామిడాల ఇస్తారి, కేయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో. తాళ్ళపల్లి మనోహర్, సోషాలజీ, సోషల్ వర్క్ విభాగాధిపతి డా. ఎం. స్వర్ణలత, ఆ విభాగపు ఆచార్యులు డా. కే. సుభాష్, డా. కే. ప్రసన్న, డా. ఎస్. సాహితీ, ఎం. జాస్మిన్, బి. రజిత మరియు ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ ప్రో. ఈసం నారాయణ కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేయూ రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం మాట్లాడుతూ, మినిస్టర్ ఆఫ్ వుమెన్ అండ్ చైల్ డెవలప్మెంట్, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం దేశం కోసం, ధర్మం కోసం కేవలం 7 సంవత్సరాల వయసులో ప్రాణాలను త్యాగం చేసిన జోరావర్ సింగ్ మరియు ఫతే సింగ్ ల స్మారకార్థం వీర్ బాల్ దివస్ ను జనవరి 3న కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రో. మామిడాల ఇస్తారి, డీన్ స్టూడెంట్ అఫైర్స్, మరియు డా. స్వర్ణలత, విభాగాధిపతి, సోషాలజీ & సోషల్ వర్క్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5.00 గంటల వరకు ‘వీర్ బాల్ దివస్- జాతి నిర్మాణానికి స్ఫూర్తి‘ అనే అంశంపై వ్యాసరచన పోటీలు మరియు వక్తృత్వ పోటీలు తెలిపారు. కేయూ పరిధిలోని అన్ని అనుబంధ కాలేజీల విద్యార్థులు పాల్గొనవచ్చని, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి 2, 2026 చివరి తేదీగా నిర్ణయించామని, రిజిస్ట్రేషన్ కొరకు యూనివర్సిటీ వ్బుసైట్ను సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమం కాకతీయ యూనివర్సిట్ గోల్డెన్ జూబిలీ వేడుకలలో భాగంగా విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం, జాతీయతా భావం వంటి విలువలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించబడుతుందనీ ఒక ప్రకటనలో తెలిపారు.