10 June, 2026 | 6:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

సమస్యలు పరిష్కరించాలి

30-12-2025 12:00 AM

అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్

జనగామ, డిసెంబర్ 29 (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తు లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సమస్య లను వేగవంతం గా పరిష్కరించాలని.. అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్* అన్నారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం సందర్బంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఇచ్చిన దరఖాస్తు లను అదనపు కలెక్టర్ లు స్వీకరించి వారి సమస్య లను తెలుసుకున్నారు. అనంతరం అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజల సమస్య లను పరిష్క రించడం లో అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. సమస్య లను పరిష్కరించే క్రమం లో దరఖాస్తు దారులకు సమాచారం అందించాలన్నారు.

అనంతరం గురుకులాల,వివిధ సొసైటీల రెసిడెన్షిషియల్ పాఠశాలలో బ్యాక్ లాగ్, కొత్త అడ్మిషన్ లకు సంబందించిన అర్హత పరీక్ష పోస్టర్ ని అదనపు కలెక్టర్ లు ఆవిష్కరించారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి 31 దరఖాస్తు లు వచ్చాయి.జనగామ లో నివాసం ఉంటున్న మేకల ప్రశాంత్, తండ్రి: కీ.శే. మేకల శ్రీనివాస్, అనే వ్యక్తి తన భూమి విషయంలో జరిగిన అక్రమ నమోదుపై ఫిర్యాదు చేసి వారి వద్ద ఉన్న ఒరిజినల్ రిజిస్టేషన్ డాక్యుమెంట్లను పరిశీలించి, అక్రమంగా నమోదైన వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుండి తొలగించి, వారసుడినైన తన పేరు మీద పట్టా మార్పిడి చేసి కొత్త పాసుపుస్తకం మంజూరు చేయాలని వినతి సమర్పించాడు. ఈ కార్యక్రమం లో ఆర్డీ వో లు, డి ఆర్డీ ఓ, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.