04-02-2026 12:36:22 AM
పాల్గొన్న జంపన విద్యావతి ప్రతాప్ దంపతులు
సికింద్రాబాద్ ఫిబ్రవరి 3,(విజయ క్రాంతి): కంటోన్మెంట్లో ప్రసిద్ధిచెందిన న్యూ బోయినపల్లి న్యూ సిటీ కాలనిలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం పుష్కర 24 వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంకటేశ్వర స్వామి రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురవవీధుల్లో మంగళ వాయిధ్యాలతో టపాసు లు కాలుస్తూ గరుడ సేవతో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తుల గోవిందా నామాల మధ్య భక్తుల అడుగడుగునా భక్తుల నీరజనాలు అందుకుంటున్న ఈ రథయాత్ర కొనసాగింది.
ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యురాలు జంపన విద్యావతి, రథం దాత సుమంత్ రెడ్డి దంపతులు, ఆల య ప్రధానర్చకులు తిరుమల పవన్ కుమార్ స్వామి, ఆలయ కమిటీ అధ్యక్షులు అర్.నారాయణ, ఉపాధ్యక్షులు రా మ్మోహన్ రావు, కార్యదర్శి యాదయ్య, ఉప కార్యదర్శి అత్మానంద రెడ్డి,కోశాధికారి లక్ష్మ ణ్, కార్యవర్గ సభ్యులు మోహన్ రావు, జగన్నాధం, నర్సింహారావు, సాంబా శివ రావు, పెంటా రెడ్డి, ధర్మవీర్ భక్తులు పాల్గొన్నారు.