calender_icon.png 4 February, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్

04-02-2026 12:37:46 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఎన్నికల సాధారణ పరిశీలకుడు శ్యామ్ ప్రసాద్ లాల్ మరిపెడ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం, సెంట్ అగస్టిన్ హై స్కూల్ కౌంటింగ్ కేంద్రం ను పరిశీలించారు.

ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం అధికారులు పక్కాగా సౌకర్యాలను కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ముగిసే వరకు రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు త్రాగునీరు, చైర్స్, టెంట్స్, దివ్యాంగుల కోసం వీల్ చైర్స్, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వైద్య బృందం ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం కౌంటింగ్ కేంద్రానికి తరలించే క్రమంలో రిటర్నింగ్ అధికారులు పోలీస్ భద్రతా సిబ్బంది మధ్య పోలింగ్ బాక్సులు తరలించాలని, అభ్యర్థులకు సంబంధించి ప్రచార ముందస్తు అనుమతులు, ఖర్చుల వివరాలు, తదితర అనుమతులను సమయం లోగా తీసుకునే విధంగా అభ్యర్థులకు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. జనరల్ అబ్జర్వర్ వెంట నోడల్ ఆఫీసర్ కృష్ణవేణి, స్థానిక మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఎన్నికల విభాగం అధికారులున్నారు.