13 March, 2026 | 11:24 AM

పశువుల ఆరోగ్య రక్షణ కోసమే పశు వైద్య శిబిరాలు

20-01-2026 05:03 PM

కృషి విజ్ఞాన కేంద్రం కోర్డినేటర్ గోపాల్ వర్మ

తలమడుగు,(విజయక్రాంతి): కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో టిడిసి-నిక్రా  కార్యక్రమం కింద తలమడుగు మండల పశు సంవర్థక శాఖ సహకారంతో మండలం లోని లచ్చంపూర్ లో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు అవసరమైన మందులు, టీకాలు, ఖనిజ లవణాల మిశ్రమం, మినరల్ లిక్ బ్రిక్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా కృషి విజ్ఞాన కేంద్రం కోర్డినేటర్ డాక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.... పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. పశువుల ఆరోగ్య సంరక్షణ ద్వారా రైతుల ఆదాయం పెంపొందించడంలో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని  పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగు, శాస్త్రవేత్తలు డా. రఘువీర్,  డా. శివచరణ్, డా. సురేష్, డా. రాకేష్‌, మండల పశు వైద్యాధికారిణి లావణ్య, ఎల్ఎస్ఎ సాయి ప్రసాద్, పశు వైద్య సిబ్బంది సౌమ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.