30-07-2025 04:47:45 PM
బైంసా (విజయక్రాంతి): బాధితులకు సత్వర న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) అన్నారు. బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా సబ్డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 10 ఆర్జిదారుల ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్ లో మాట్లాడి, బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే పలు కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం గతంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకునీ వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు.