01-05-2025 12:37:12 AM
ఖమ్మం, ఏప్రిల్ 30( విజయక్రాంతి ):-పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి, విజయదుందిబీ మోగించి, జిల్లా పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేశారు. తెలంగాణ విద్యా రణ్య హైస్కూల్ ప్రభంజనంఖమ్మం ముస్త ఫా నగర్ లోని తెలంగాణ విద్యారణ్య హై స్కూల్ విద్యార్థినీ ఆర్. జీవన్ శ్రీ 561/ 600 మార్కులు సాధించింది. అంతేకాకుం డా 500 పైగా మార్కులు 10 మంది వి ద్యార్థులు సాధించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఇంతటి ఘనవిజయాన్ని సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు, అధ్యా పక వర్గానికి, సిబ్బందికి, తల్లిదండ్రులకు తెలంగాణ విద్యారణ్య హైస్కూల్ చైర్మన్ డాక్టర్ పాపారావు, కరస్పాండెంట్ శ్రీ విద్య అభినందనలు తెలియజేశారు.