26-07-2025 12:22:47 AM
సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
న్యూఢిల్లీ, జూలై 25: భారతదేశం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీ ఎస్) జనరల్ అనిల్ చౌహాన్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ కొన సాగుతోందని, పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి ఒడిగట్టినా మన దళాలు 365 రోజులు, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నా రు. ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్లో ఆయన మాట్లాడుతూ.. సాంకే తికత అభివృద్ధి చెందిందని, సైన్యం కూడా ఎప్పటికప్పుడు వ్యూహాత్మకత, కార్యచరణ, నైపుణ్యాలను మా ర్చుకోవాల్సిన అవసరముందన్నా రు.
ఆయుధాలు, ఇతర పరిజ్ఞానం గురించి సైన్యం పూర్తిగా అప్డేట్ అ యి ఉండాలని సూచించారు. యు ద్ధాల గతి మారిపోతుందని సీడీఎస్ వెల్లడించారు. భవిష్యత్తులో దళాల్లో ఇన్ఫో-టెక్తో పాటు స్కాలర్ వారియర్స్ కలిసి ఉంటారని తెలిపారు. ఏం జరగబోతున్నా మనం ఎల్లప్పు డూ సన్నద్ధంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. సైనిక దళాల్లో జరుగుతున్న మార్పుల మూడో విప్లవం కీలక దశలో మనం ఉన్నట్టు వెల్లడించారు. దానిని తాను కన్వర్జెన్సీ యుద్ధంగా అభివర్ణిస్తానన్నారు.