26-07-2025 12:19:47 AM
కేరళలో సంచలనం సృష్టించిన సౌమ్య అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న చార్లీ థామస్ జైలు నుంచి పరారయ్యాడు. తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి పరారయ్యాడు.అనంతరం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కన్నూరు తలప్పు ఏరియాలోని ఒక పాడుబడ్డ బావిలో చార్లీ దాక్కున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.