calender_icon.png 19 June, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్ సంకల్ప సభ కరపత్రం విడుదల చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్. మల్లారెడ్డి

19-06-2025 06:58:53 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency) దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్ సిక్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్ లో ఈ నెల 22వ తేదీనా ఉదయం 10 గంటల నుండి నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభ కరపత్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు డా ఎస్.మల్లారెడ్డి(BJP District President Dr. S. Mallareddy) విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి నరేంద్ర మోడీ పాలన సాధించిన ఎన్నో గొప్ప విజయాలు తెలంగాణ ప్రజనీకానికి తెలియజేయడం జరుగుతుందని, కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి. విగ్నేష్వర్, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు డి. శ్యామ్ రావ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి భానుగౌడ్ సీనియర్ నాయకులు ఏ. మల్లేష్ యాదవ్, ఆకుల మల్లేష్, ఆర్. నర్సింహా చారీ, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.