17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ అభివృద్ధి

28-04-2025 07:42 PM

గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ గాని సుధాకర్ గౌడ్..

తుంగతుర్తి (విజయక్రాంతి): మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను తూర్పుగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు గుండగాని సుధాకర్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేసినందుకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండగాని మహేందర్, లింగంపల్లి హనుమంతు, గునిగంటి వెంకన్న, గుండగాని రమేష్, తాడూరి యాకన్న, గుండగాని లక్ష్మణ్, గుండగాని కన్నయ్య తదితరులు పాల్గొన్నారు