calender_icon.png 26 June, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన గ్రామ కార్యదర్శి

25-06-2025 01:51:21 AM

నిర్మల్, జూన్ 24 (విజయక్రాం తి): నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మం డలం గుడిసెరాల గ్రామానికి చెందిన పంచాయతీ కార్య దర్శి శివకృష్ణ మం గళవారం రూ.12వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికినట్టు డీఎస్పీ మధు తెలిపారు. గుడిసెల గ్రామానికి చెందిన గొలుసుల రాజే శం గ్రామంలో కొత్త వాటర్ ప్లాంట్ ఏర్పా టు చేసుకోవడానికి గ్రామపంచాయతీ నుం చి ఎన్‌ఓసీ కోసం గ్రామ కార్యదర్శి శివరామ కృష్ణను ఆశ్రయించారు.

ఎన్‌ఓసీ కావాలం టే రూ.15 వేలు ఇవ్వాలని గ్రామ కార్యదర్శి డిమాండ్ చేశాడు. చివరకు 12 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన రాజేశం.. మంగళవారం ప్రకృతి వనం వద్ద రూ.12 వేల నగదును కార్యదర్శి అందించారు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి శివ రామకృష్ణను పట్టుకొని అరెస్ట్ చేశారు.