11-06-2025 06:50:35 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్ వి వేణుగోపాల చారి(Electricity Consumers Forum Chairman NV Venugopal Chari) ఆధ్వర్యంలో బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సబ్ డివిజన్ లో విద్యుత్ వినియోగదారుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యుత్ వినియోగదారుల నుంచి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి, అందులో బిల్లింగ్ కు సంబంధించి, ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించి వచ్చిన 8 సమస్యల్లో నాలుగు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల ఫోరం సభ్యులు కె. రమేష్ మేంబర్, చరణ్ దాస్, ఏం.రామారావు, డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ పి విజయకుమార్, డివిజన్ ఇంజనీర్(టెక్నికల్) పెద్దిరాజాం, ఎస్ఏఓ శంకర్, ఏడీఈ ప్రశాంత్, ఏఈలు శశిధర్, రాజు, ఏఏవో లావణ్య, సబ్ ఇంజనీర్ కరుణాకర్, విద్యుత్ సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.