14 April, 2026 | 8:57 PM

సర్పంచ్‌ ధర్మాను సన్మానించిన గ్రామస్తులు

16-12-2025 04:36 PM

ములకలపల్లి (విజయక్రాంతి): మండలంలోని పూసుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన భూక్య ధర్మాను మంగళవారం ఒడ్డు రామవరం, కొమ్ముగూడెం గ్రామస్తులు సన్మానించారు. ఒడ్డు రామవరంలోని ఆయన స్వగృహంలో గ్రామస్తులు ఆయనను కలుసుకొని సర్పంచ్‌గా ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు.