31 July, 2026 | 8:23 PM

Breaking News

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •  

మణిపూర్‌లో మళ్లీ హింస

11-02-2026 01:11 AM

ఉఖ్రుల్ జిల్లాలో 50 ఇండ్లకు నిప్పు.. పూర్తిగా దగ్ధం

ఇంటర్నెట్ సేవలు బంద్.. జిల్లాలో కర్ఫ్యూ విధింపు

ఇంఫాల్, ఫిబ్రవరి ౧౦: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలోని లిటాన్ సారైఖోంగ్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు పదుల సంఖ్యలో ఇళ్లకు నిప్పుపెట్టడం కలకలం రేపింది. ఘటనలో 50 ఇళ్లవరకు దగ్ధమయ్యాయి. కొందరు గ్రామస్తులు క్షతగాత్రులయ్యారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అలెర్ట్ అయిన.. రాష్ట్రప్రభుత్వం వెనువెంటనే రాష్ట్రంలో ఐదురోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

దీంతో ఆ రాష్ట్రంలో ఐదురోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే.. జిల్లావ్యాప్తంగా సర్కార్ కర్ఫ్యూ విధించింది. టాంగ్ఖుల్ నాగా, కుకీ జాతుల మధ్య తలెత్తిన ఘటనకు కారణమి తెలుస్తోంది. ఇటీవల టాంగ్ఖుల్‌నాగా వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై కొందరు దాడి చేయగా, ఆ మరుసటి రోజున నుంచి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పోలీసులు అంచనాకు వచ్చారు.