calender_icon.png 20 June, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరాటపాలెం.. నన్ను చాలా వెంటాడిన కథ

20-06-2025 12:16:51 AM

అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు జంటగా నటించగా, కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన తాజా వెబ్‌సిరీస్ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’. దివ్య అందించిన కథతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సిరీస్ జూన్ 27న జీ5లో ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. “విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ పోస్టర్ నాకు చాలా నచ్చింది.

‘రెక్కీ’ నాకు చాలా ఇష్టమైన సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ఈ సిరీస్‌తో వస్తున్నారు. అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది” అన్నారు. కథానాయిక అభిజ్ఞ మాట్లాడుతూ.. “మూఢనమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి” అని చెప్పారు. చరణ్ లక్కరాజు మాట్లాడుతూ.. “క్యాస్టింగ్ మేనేజర్ సతీశ్ వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.

శ్రీరామ్ నన్ను ఓకే చేశారు. కృష్ణ లాంటి దర్శకుడితో పనిచేయడం నా అదృష్ణం. అభిజ్ఞతో పనిచేయడం సంతోషంగా ఉంది” అని తెలిపారు. డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. “రెక్కీ’లానే ఈ ప్రాజెక్ట్‌నూ ఎంజాయ్ చేస్తూ చేశా. ఈ సిరీస్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అన్నారు. “రెక్కీ తర్వాత పదిహేను కథలు విన్నా. ఈ కథ నన్ను చాలా వెంటాడింది” అని నిర్మాత శ్రీరామ్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్ మహేశ్ కే స్వరూప్, కథా రచయిత్రి దివ్య, జీ5 కంటెంట్ హెడ్ సాయితేజ్, మిగతా సిరీస్ టీమ్ పాల్గొన్నారు.