19-06-2025 10:55:35 PM
‘రెక్కీ’ లాంటి థ్రిల్లింగ్ వెబ్సిరీస్ తర్వాత ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ అనే మరో సిరీస్తో వస్తున్నారు మేకర్స్. కృష్ణ పోలూరు(Krishna Poluru) దర్శకత్వం వహించిన ఈ తాజా సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా అలరించబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న జీ5లో ప్రీమియర్ కానుంది. ఈ క్రమంలో గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హీరో నవీన్చంద్ర(Actor Naveen Chandra) ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నవీన్చంద్ర మాట్లాడుతూ.. “విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్గా చాలా చక్కగా కనిపిస్తున్నారు. ‘రెక్కీ’ నాకు చాలా ఇష్టమైన సిరీస్. ఆ డైరెక్టర్ మళ్లీ ఈ సిరీస్తో వస్తున్నారు. అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. ‘చాయ్ బిస్కెట్’ నుంచి అభిజ్ఞ నాకు తెలుసు. ఆమె అద్భుతమైన నటి. దివ్య లాంటి రైటర్లకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్లో నాకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ ట్రైలర్లో ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్తోపాటు మూఢనమ్మకాల కాన్సెప్ట్ను కూడా టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ సిరీస్తో టీమ్కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా” అన్నారు.
కథానాయిక అభిజ్ఞ మాట్లాడుతూ.. “ఇంత మంచి కథను రాసిన దివ్య గారికి థాంక్స్. మూఢనమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. శ్రీరామ్ గారు నాకు కథ చెప్పినప్పుడే అద్భుతమైందని అర్థమైంది. ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. దర్శకుడు కృష్ణ గారితో పనిచేయడం ఆనందంగా ఉంది” అని చెప్పారు. నటుడు చరణ్ లక్కరాజు మాట్లాడుతూ.. “క్యాస్టింగ్ మేనేజర్ సతీశ్ వల్లే ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు. నన్ను ఓకే చేసిన శ్రీరామ్ గారికి థాంక్స్. కృష్ణ గారి లాంటి దర్శకుడితో పని చేయడం నా అదృష్ణం. అభిజ్ఞ గారితో పనిచేయడం సంతోషంగా ఉంది” అని తెలిపారు. డైరెక్టర్ కృష్ణ పోలూరు మాట్లాడుతూ.. “నేను జీ5లో ఇదివరకు ‘రెక్కీ’ చేశాను. అద్భుతమైన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు దివ్య గారు కథను అందించారు. ‘రెక్కీ’లానే ఈ ప్రాజెక్ట్నూ ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సిరీస్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అన్నారు. “రెక్కీ తర్వాత పదిహేను కథలు విన్నా. దివ్య గారు చెప్పిన నెరేషన్ విన్న తర్వాత నన్ను ఆ కథ నన్ను చాలా వెంటాడింది” అని నిర్మాత శ్రీరామ్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్ మహేశ్ కే స్వరూప్, కథా రచయిత్రి దివ్య, జీ5 కంటెంట్ హెడ్ సాయితేజ్, మిగతా సిరీస్ టీమ్ మాట్లాడి తమ అనుభవాలు, అభిప్రాయాలను ఈ వేదికపై పంచుకున్నారు.