వర్ష బాధితులకు కూనంనేని పరామర్శ

24-04-2024 12:09:08 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 23 (విజయకాంత్రి) : కొత్తగూడెం పట్టణ పరిధిలోని  వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం  పర్య టించి బాధితులను పరామర్శించారు. ఈదురుగాలులు, వడగండ్ల వానతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి జరిగిన నష్టాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేసి సరఫరాను అందించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు మామిడి, వరి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు. గాజులరాజం బస్తీలో ఇంటి రేకు మీద పడి గాయాలపాలైన దేవమ్మ అనే మహిళను పరామర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.