27-06-2025 12:10:25 AM
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజాచిత్రం ‘వార్2’. యశ్రాజ్ ఫిలింస్ (వైఆర్ఎఫ్) నుంచి వస్తున్న మరో స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. అయ్యన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ మూవీ ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యుకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ఈస్ట్ ఆసియా సహా భారతదేశంలో ఐమాక్స్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్కు మరో 50 రోజులు మాత్రమే ఉందని తెలియజేసే సరికొత్త పోస్టర్ను టీమ్ గురువారం విడుదల చేసింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీలకు సంబంధించిన ఈ పోస్టర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.