calender_icon.png 7 November, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ ప్రారంభం

06-11-2025 11:09:15 PM

జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన నటి శ్రీలీల..

వరంగల్/హనుమకొండ (విజయక్రాంతి): వస్త్రవ్యాపార రంగంలో బ్రాండ్ ఇమేజ్ సృష్టించిన ఆర్ఎస్ బ్రదర్స్ దక్షిణ భారతదేశంలో విస్తరణలో భాగంగా గురువారం తెలంగాణలో చారిత్రక వరంగల్ నగరంలో తమ సరికొత్త షోరూమ్ ను అంగరంగ వైభోగంగా ప్రారంభం చేసింది. వ్యాపారరంగంలో ప్రముఖ దార్శనికులైన పి.వెంకటేశ్వర్లు, ఎస్. రాజమౌళి, టి.ప్రసాదరావు, దివంగత పి.సత్యనారాయణ దూర దృష్టితో ప్రణాళికాబద్ధంగా నెలకొల్పిన ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ- సంప్రదాయాన్ని, ఆధునిక ఫ్యాషన్లను మేళవించి భారతదేశ వ్యాప్తంగా కొనుగోలుదారులకు చేరువవుతోంది. అందులో భాగంగా వరంగల్లోని సరికొత్త షోరూమ్ వైవిధ్యభరితమైన అభిరుచులు కలిగిన నగరవాసుల హృదయాల్ని చూరగొనేలా ప్రారంభించింది.

ప్రముఖ సినీతార శ్రీలీల ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నూతన షోరూమ్ను సందర్శించి వరంగల్ లోని షాపింగ్ ప్రియులకు ఇది అందమైన కొనుగోలు గమ్యంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వినియోగదారుల అభిరుచుల వైవిధ్యానికి తగినట్లుగా తమ బ్రాండ్ మరింతగా విస్తరిస్తుందన్నారు. మారుతున్న పోకడలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నాణ్యతతోపాటు సరసమైన ధరలతో కొత్తదనాన్ని అందించగలమని, ఇతర ప్రాంతాలలో కూడా కొత్త షోరూమ్స్ నెలకొల్పనున్నామని చెప్పారు. వరంగల్లో షోరూమ్లో అన్ని తరాల అభిరుచులను ప్రతిబింబించే ఉమెన్స్ వేర్, మెన్స్వేర్, కిడ్వేర్ రూ.149ల ప్రారంభ ధరతో కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి. సంస్థ చైర్పర్సన్, హోల్ టైం డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు తమ వరంగల్ షోరూమ్లో వెడ్డింగ్ కలెక్షన్స్, పెళ్లి కుమార్తె సంప్రదాయ వస్త్రాలంకరణకు సంబంధించిన సాధికారికమైన పనితనంలోని ప్రత్యేకత గురించి వివరించారు.