17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నేను స్థానికున్నే...

05-02-2026 01:12 AM

- ఆదరించండి..  అండగా ఉంటా

- 7వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్ సి సంతోష్ గుప్తా 

గజ్వేల్, ఫిబ్రవరి 4 : ప్రజల అమూల్యమైన ఓటును వేసి ఆదరిస్తే ఎల్లవేళలా అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తానని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్ సి సంతోష్ గుప్తా అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజల నుండి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ పునరావాసులకు ఆర్ అండ్ ఆర్ కాలనీని అద్భుతంగా నిర్మించారని, మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

స్థానికత పేరుతో కొందరు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తాను కూడా ఏడవ వార్డులోనే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయాల అభివృద్ధికి బోర్లు వేసి సహకరించినట్లు ఆయన తెలిపారు. ఎర్రవల్లి సింగారం గ్రామాల ప్రజలు తనకు తోడుండి ఓటు వేసి గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు పెంటా రెడ్డి, రామ్ రెడ్డి, రత్నారెడ్డి, శివకుమార్, భాస్కర్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.