15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం

05-02-2026 01:15 AM

11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పెండల మల్లేష్ ముదిరాజ్ 

జిన్నారం/ అమీన్ పూర్ ఫిబ్రవరి 4: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నన్ను నమ్మించి బీఫామ్ ఇస్తానని మోసం చేసిందని గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోలోని 11వ వార్డు అభ్యర్థి పెండాల మల్లేష్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. 11వ వార్డు తనకు కేటాయిస్తే 100 పైచిలుకు మెజారిటీతో గెలిచి చూపించేవాడినన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వివక్ష చూపుతూ టికెట్లు కేటాయించడంలేదని, తనకు టికెట్ రా కుండా కుట్రలు చేశారని ఆరోపించారు.

బడుగు బలహీన వర్గాలకు కొంత మేరకు రాజకీయాల్లో ఉన్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అని కొనియాడారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మచబోయిన లింగం, రామకృష్ణ, వెంకటేష్, ఎల్లయ్య,గోవింద్, జగన్, కుమార్, దశరథ్, రాజు పాల్గొన్నారు.