24 March, 2026 | 9:47 PM

వార్న్ నా ఆరాధ్య క్రికెటర్

24-08-2024 12:30 AM

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ తన ఆరాధ్య క్రికెటర్ అని టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అభిప్రా యపడ్డాడు. వార్న్ మరణంతో ఒక కుటుం బ సభ్యుడిని కోల్పోయినట్లు అనిపించిందని కుల్దీప్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న కుల్దీప్ శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా కుల్దీప్ వార్న్ విగ్రహానికి నివాళి అర్పించాడు. కుల్దీప్ మాట్లాడుతూ.. ‘షేన్ వార్న్ నా ఆరాధ్య క్రికెటర్. నాకు అతడితో మంచి అనుబంధం ఉంది.

వార్న్ గురించి ఆలోచన వస్తే ఇప్పటికీ ఉద్వేగానికి లోనవుతా. వార్న్‌ను కోల్పోయినప్పుడు నా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్లు అనిపించింది’ అని అన్నాడు. 2022 ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లోని విల్లాలో గుండెపోటుకు గురైన వార్న్ మృతి చెందిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన కుల్దీప్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ కుటుంబంతో గడుపుతున్నాడు. త్వరలో మొదలు కానున్న దులీప్ ట్రోఫీలో గిల్ నేతృత్వంలోని ఏ ప్రాతినిథ్యం వహించనున్నాడు.