పారాలింపిక్స్లో తొలి ట్రాన్స్జెండర్
24-08-2024 12:30 AM
బోలోగ్నా (ఇటలీ): పారిస్ వేదికగా పారాలింపిక్స్ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇటలీకి చెందిన వాలెంటియా పెట్రిల్లో పోటీ ల్లో ప్రాతినిధ్యం వహించనుంది. 50 సంవత్సరాల పెట్రిల్లో 200, 400 మీటర్ల పరుగుపందెంలో టీ12 కేటగిరీలో ఆడనుంది. కాగా పారాలింపిక్స్ లో పాల్గొంటున్న తొలి ట్రాన్స్జెండర్ మహిళగా వాలెంటియా రికా ర్డులకెక్కనుంది.




