18 March, 2026 | 8:47 PM

స్మశాన వాటికలో నీటి సౌకర్యం ఏర్పాటు

18-03-2026 05:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్మశాన వాటికల్లో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ నూతన పాలకవర్గం స్పందించింది. గత నాలుగు రోజుల క్రితం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి స్థానిక కౌన్సిలర్ లు, స్మశాన వాటిక కమిటీ సభ్యులతో కలిసి సందర్శించారు.  కనీసం నీటి సౌకర్యాలు కూడా లేకుండా స్మశాన వాటిక నిర్వహణ కొనసాగడం ఆశ్చర్యానికి గురించేసింది.

స్మశాన వాటికల్లో పారిశుద్యం, నీటి సౌకర్యం కొరకై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో మరుసటి రోజు పారిశుధ్యం పనులు పూర్తి చేసి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు రోజుల్లో మంచిర్యాల చౌరస్తాలోని స్మశానవాటికలో నీటి సౌకర్యం కలిపించారు. నిర్మల్ మున్సిపల్ పరంగా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిచడం జరుగుతదని, అత్యవసరమైన సమస్యలపై వేగంగా చర్యలు తోసుకోవడం జరుగుతదని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పట్టణ ప్రజలకు వివరించారు.