త్యాగాలతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం
04-06-2026 01:36 AM
పవన్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కుమార్తె
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి) : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గద్దరు కూతురు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు.. ఈ రోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు అన్నారు. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదని త్యాగాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం అని ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నామే తప్ప ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదని వెన్నెల పేర్కొన్నారు.






