calender_icon.png 3 June, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం

02-06-2025 01:33:30 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య 

చేవెళ్ల రూరల్, జూన్ 1 : పేదల సొంతింటి కల సాకా రం చేస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య స్ప ష్టం చేశారు. ఆదివారం చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గ్రామంలో లబ్ధిదారు ఊరడి మాధవి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో 18 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అంజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు . 60 గజాల్లో మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలని, ఎ క్కువ స్థలంలో కడితే బిల్లులు రావన్నారు. ఈ విడతలో ఇండ్లు రాని వారికి మలి విడత లో  ఇస్తామని హామీ ఇ చ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట పొల్యూషన్ కంట్రో ల్ బోర్డు సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంట య్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు గోనె ప్రతాప్రెడ్డి, దేవర వెంకట్రెడ్డి, డీసీసీ ఉపాధ్య క్షులు పడాల రాములు, ఆగిరెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డై రెక్టర్ పాండు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వీరేందర్రెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీని వాస్ గౌడ్, మాజీ సర్పంచులు ప్రభాకర్, జహంగీర్, రాంచంద్రయ్య, వెంక టేశం గుప్తా, మధుసూదన్ గుప్తా, లావణ్య శంకర్,  స్థానిక నాయకులు గోనె శ్రీనివా స్ రెడ్డి, జంగారెడ్డి, జనార్దన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.