02-06-2025 01:30:26 AM
రాజేంద్రనగర్, జూన్ 1: విమానంలో అక్రమంగా పా ములు, తాబేళ్లు విదేశాల నుంచి తీసుకురాగా ఎయిర్పోర్ట్ లో అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆలస్యంగా వెలుగు చూసిం ది. అధికారుల కథనం ప్రకారం..బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 37 పాములు, తాబేళ్లను శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు.
ముంబై కి చెందిన షేక్ నిజాముద్దీన్, షేక్ అల్తాఫ్ అలీ బ్యాంకాక్ నుంచి ఇండియా బయలుదేరారు. వారు ప్రాణాలతో ఉన్న 28 రెడ్ టెయిల్ బాంబూ పిట్ వైపర్లు, మూడు స్పుడర్ టెయిల్ హారమ్డ్ వైపర్లు, ఆరు తాబేళ్లను తమ సామగ్రిలో రహస్యంగా దాచి ఉంచి ఇండిగో ఎయిర్ లైన్స్ 6ఈ-1066 విమానంలో వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగారు.
వారి ప్రవర్తన అనుమానంగా ఉండటం తో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి సామగ్రిని తనిఖీ చేయగా అందు లో పాములు, తాబేళ్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీ నం చేసుకున్న అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.