12-10-2024 01:23:51 AM
మల్లికా శెరావత్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలోని విషయాలపై స్పందించారు. ‘మర్డర్‘ అనే చిత్రంలో కొన్ని బోల్డ్ సన్నివేశాల్లో మల్లిక నటించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో కలిసిన కొందరు గొప్ప వ్యక్తుల కారణంగా తనను తాను మార్చుకున్నానన్నారు.
ముఖ్యంగా మహేశ్ భట్ సెట్స్లో అమ్మాయిలకు చాలా రక్షణ ఉంటుందన్నారు. ఆయన రూపొందించిన చిత్రమే ‘మర్డర్’ అని, దానిలో తనపై కొన్ని బోల్డ్ సన్నివేశాలను తను చేయాల్సి వచ్చిందని మల్లిక తెలిపారు. వాస్తవానికి సెట్స్లో చాలా మంది ఉంటారని, వారందరి ముందు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం కాస్త ఇబ్బందిగా ఉంటుందన్నారు.
అయితే మహేశ్ భట్ అలాంటి ఇబ్బంది లేకుండా చూశారన్నారు. ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ చిత్రంలో రాజ్ కుమార్ రావు, త్రిప్తి డిమ్రి జంటగా నటించారు. రాజ్ శాండిల్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.