calender_icon.png 31 May, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ సమైక్యతను చాటాలి

10-05-2025 12:00:00 AM

  1. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సంఘీభావాలు, ప్రత్యేక పూజలు, హోమాలు..

మోదీ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ మే 9 (విజయ క్రాంతి): ఇటీవల పహల్గాంలో భారత పౌరులను నిర్దాక్ష్యంగా  కాల్చి చంపడంతో  పాకి స్తాన్‌పై మన దేశ రక్షణ సైనికులు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో భాగం గా ఎమ్మెల్యే కోవలక్ష్మి శుక్రవారం జిల్లా కేం ద్రంలోని శ్రీకేశవనాథస్వామి ఆలయంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు ఒజ్జల నరేష్ శర్మ, శిరీష్ శర్మలు స్వామివారికి గణపతి పూజ, శ్రీదేవి భూదేవి సమేత కేశవనాథ స్వామివారికి పురుష సూక్త అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తు తం శత్రు దేశమైన పాకిస్తాన్‌పై మన రక్షణ బలగాలు చేపడుతున్న విరోచిత పారోటానికి 140 కోట్ల మంది దేశ ప్రజలు ఐక్యంగా ఉం టూ సైనికులకు, ప్రభుత్వానికి రాజకీయా ల కు అతీతంగా అండగా ఉండాల్సిన సమ యం ఎంతైనా అవసరం ఉందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిజం అంతం కావాలని ప్రపంచ దేశాలు సైతం భారత్‌కు మద్ద తు ఇవ్వడం శుభసూచికమన్నారు. ఈ సందర్బంగ భారత్ మాతాకీజై, జైజవాన్.. జైకిసా న్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమం లో వైరాగడె మనోజ్, సుగుణాకర్, కాండ్రె విశాల్, గంధం శ్రీనివాస్, రవికుమార్ జోషి, శంకర్రావ్, సురేష్ చారి, సంతోష్ కుమార్, మహిళలు పాల్గొన్నారు. 

బుగ్గ ఆలయంలో ప్రత్యేక హోమం 

బెల్లంపల్లి అర్బన్, మే 9: భారత్ - పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ విజయం సాధించాలని, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని బెల్లంపల్లి శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూ జలు, హోమం నిర్వహించారు.

దేవాలయ కార్యనిర్వహణ అధికారి బాపురెడ్డి, ఆలయ చైర్ పర్సన్ మసాడి శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ  ఛైర్ పర్సన్ మాసా డీ శ్రీదేవి, శ్రీరాములు, బిజెపి జిల్లా కార్యదర్శి గోవర్ధన్, శ్రావణ్ కుమార్, మాజీ సర్పంచ్ వెంకటస్వామి పాల్గొన్నారు.

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

మందమర్రి, మే 9: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో బీజేపీ నాయకు లు హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్‌లో శుక్రవారం బీజేపీ  నాయకులు భారీ ర్యాలీ చేపట్టి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి, టపాసులు పేల్చి సంబురాలు జరుపుతున్నారు.

దేశ స మగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తు వారికి మానసిక ధైర్యం ఇచ్చే విధంగా  కార్యక్రమాలు చేయాలని ప్రజల ను కోరారు. కార్యక్రమంలో నాయకులు డివి దీక్షితులు, శ్రీనివాస్, దార రవి సాగర్, వినయ్, రంగు శ్రీనివాస్, జక్కుల సమ్మ య్య, మేకల రమేష్, బస్టాండ్ వ్యాపార సం ఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.