29-05-2025 08:18:02 PM
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య పిలుపు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే ఎర్రజెండా లక్ష్యం అని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య(CPM Central Committee Members Veerayya) అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి శిక్షణ తరగతుల ముగింపు సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరయ్య మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పోరాటం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని, పీడిత ప్రజలకు అండగా నిలిచేందుకు కమ్యూనిస్టులు పాటుపడాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు సూర్ణపు సోమయ్య, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, కుంట ఉపేందర్, కందునూరి శ్రీనివాస్, మధుసూదన్, రాజన్న, లచ్చయ్య, రాజశేఖర్, ఉప్పలయ్య పాల్గొన్నారు.