బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలి
జడ్జి వినీల్ కుమార్
బిచ్కుంద, జూన్ 5 (విజయక్రాంతి): సమాజములో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలని బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వినీల్ కుమార్ అన్నారు. శుక్రవారం నాడు బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలోని కోర్టు ఆవరణలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ మానవ మనుగడకు, భవిష్యత్తు తరాల సంక్షేమానికి ప్రకృతిని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వాడటం, విద్యుత్తును ఆదా చేయడం మరియు మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మణ్, రాథోడ్ మనోజ్, విశ్వనాథ్, మల్లేష్, మొహమ్మద్, ప్రకాష్ మరియు న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






