20-12-2025 12:00:00 AM
పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన ప్రారంభోత్సవంలో నగర డిప్యూటీ మేయర్ శ్రీలత
హైదరాబాద్, డిసెంబర్ 19(విజయక్రాం తి): బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 1లో గల లేబుల్స్ పాప్-అప్ స్పేస్లో ఏర్పాటైన డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీల త శోభన్రెడ్డి ప్రారంభించారు.‘విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాం డ్లూమ్, సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. నేరుగా వీవర్ నుంచి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని మోతే శ్రీలత శోభన్ రెడ్డి కోరారు.
టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి మాట్లాడుతూ చేనేత అమ్మ చల్లని ఒడివంటిదని, చేనేత దుస్తులను ప్రతి ఒక్కరు ధరించాలన్నారు.డి సన్స్ పటోలా ఆరట్స్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ వరకు కొనసా గుతున్న ప్రదర్శనలో సాంప్రదాయ వస్త్రా లు, చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్త్రోత్పుల కలెక్షన్ వేదికగా పటాన్ పటోలా, బంధాని, బనారసి, పైథాని, కాశ్మీరీ, మహేశ్వరి, కాంచీపురం, గద్వాల్, లక్నోవి, అజ్రాక్ చీరలు, సూట్లు మరియు కుర్తీలు, డ్రెస్ మెటీరియల్, ఆభరణాలు, బెడ్షీట్లు వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. నేత కార్మికులను ప్రోత్సహిం చడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యం అని ఆయన తెలిపారు.