29-07-2025 05:05:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలు కార్యకర్తలు సిద్ధం కావాలని, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర ఇంచార్జ్ సుభాష్ యకరన్ అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని మయూరి ఇన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతి రాజ్ చట్టం అధికారం విధులు కాంగ్రెస్ నాయకుల పాత్ర పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలకు గుర్తింపుకు ఎన్నికలు ఉపయోగపడతాయని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.