5 May, 2026 | 6:45 PM

Breaking News

భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •   ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకు రావాలి: కలెక్టర్ హరిత   •  

విద్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్

29-07-2025 05:08 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని కేజీబీవీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. వివిధ పాఠ్యాంశాలలో ప్రశ్నలు సంధించి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. హాస్టల్, వంటగది, పరిసరాలను పరిశీలించి మధ్యాహ్న భోజన వంటకాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం పరిశుభ్రంగా వంటచేసి అందజేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే లేదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.